కొత్త వెసులుబాటు... నోబాల్స్ మాత్రమే చూసేందుకు ఓ అంపైర్!..
- నోబాల్స్ గుర్తించకపోవడంతో గతంలో విమర్శలు
- కొత్త నిర్ణయం తీసుకున్న గవర్నింగ్ కౌన్సిల్
- పవర్ ప్లేయర్ నిబంధన ప్రస్తుతానికి పక్కనే!
ఇక మ్యాచ్ లో పవర్ ప్లేయర్ ను తీసుకురావాలన్న నిబంధనను ప్రస్తుతానికి పక్కన పెట్టాలని కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఈ అంశంపై చర్చ జరిగినప్పటికీ, బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ నుంచి అనుమతి లభించలేదని సమాచారం. వచ్చే సంవత్సరం సీజన్ కోసం డిసెంబర్ 19న కోల్ కతాలో ఆటగాళ్ల వేలం నిర్వహించాలని, 2019తో పోలిస్తే ఈసారి ఒక్కో ఫ్రాంచైజీ అదనంగా రూ. 3 కోట్ల వరకూ ఖర్చు పెట్టుకోవచ్చని కూడా కౌన్సిల్ నిర్ణయించింది.